Monday 8 April 2019

కౌంట్ డౌన్ ... 2

ఎన్నికల ప్రచారపర్వానికి ఇంక మిగిలింది 2 రోజులే.

ఇందాకే ఒక యూకే మిత్రునితో మాట్లాడుతుంటే ఈ విషయం మా మాటల్లో వచ్చింది.

ఖచ్చితంగా చెప్పాలంటే జస్ట్ ఒక 39 గంటల్లో ఈ ఎన్నికల ప్రచారపర్వం ముగుస్తుంది. తెలంగాణలో, పక్కన ఏపీలో కూడా.

కేసీఆర్ రాజకీయ వ్యూహం పుణ్యమా అని తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల గురించి పెద్దగా చర్చించడానికి ఏమీ లేకుండాపోయింది.

నల్లేరు మీద నడక.

వన్ సైడ్ వార్.

16 సీట్లు పక్కా.

ఎక్జైట్‌మెంట్, చర్చా గిర్చా ఏదైనా ఉందంటే - అది మెజారిటీ ఎక్కడ ఎంత అన్నదానిమీదే తప్ప ఇంక వేరే ఏమీ లేదు.

అలాగని దేన్నీ ఎవ్వరూ లైట్ తీసుకోలేదు.

టీఆరెస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో 20 మంది స్టార్ కాంపెయినర్లు బాగా పనిచేస్తున్నారు. వీరిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే, టీఆరెస్ ట్రబుల్ షూటర్ హరీష్‌రావు ఉన్నారు. ముఖ్యమంత్రి పొలిటికల్ సెక్రెటరీ, టీయస్ఎమ్‌డీసీ చైర్మన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి కూడా ఉన్నారు. 

ఒకవైపు కేసీఆర్ ప్రచార సభలు, మరోవైపు కేటీఆర్ సభలూ రోడ్ షోలు, ఇంకా ప్రతి ఒక్క ఎంపీ స్థానంలో ఆయా అభ్యర్థుల సభలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలు, వివిధ సంఘాలు, సమూహాలతో ప్రత్యేక మీటింగ్స్ .. అన్నీ భారీ స్థాయిలో, యమ సీరియస్‌గా జరుగుతున్నాయి.

ఇవన్నీ ఇంకో 39 గంటల్లో ముగియనున్నాయి.

తెలంగాణలో టెన్షన్ ఏం లేదు. టీఆరెస్ "మిషన్ 16" సక్సెస్ కాబోతోంది.

ఇక మిగిలింది .. మే 23 నాడు ఫలితాలు అఫీషియల్‌గా చూడ్డమే.

కట్ టూ ఏపీ పాలిటిక్స్ - 

సర్వేలన్నీ చంద్రబాబు పరాజయాన్ని, తిరుగులేని జగన్ వేవ్‌ను చెప్తున్నాయి.

అయినా సరే, చంద్రబాబు 2014 తరహాలో చివరి నిమిషంలో వేవ్‌ను తనవైపు తిప్పుకొని విజయం సాధిస్తాడని కూడా కొన్నివర్గాల అభిప్రాయం.

జగన్ శిబిరం కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా పట్టించుకొని, తగిన జాగ్రత్తలు తీసుకుంటోందనే అనుకుంటున్నాను.   

No comments:

Post a Comment