Thursday 28 June 2018

పీవీ ఖచ్చితంగా ఇలా మాత్రం చేసేవాడు కాదు!

సరిగ్గా వారం క్రితం ...
హైదరాబాద్, ఆల్విన్ కాలనీ, కుక్కట్‌పల్లిలో ఏటీఎమ్‌లో డబ్బులు తీస్కోడానికి - మెయిన్‌రోడ్ పైన సాయిబాబా కమాన్‌కు కుడివైపు 2, ఎడమవైపు 6, లోపలికి ఇంకో 4 ... మొత్తం 12 ఏటీఎమ్‌లు వర్షంలో తిరిగాను. ఏ ఒక్కదానిలోనూ డబ్బులేదు.

అంతదూరం నేను వెళ్లిన ఒక ముఖ్యమైన పని పూర్తిచేసుకోకుండానే వెనుదిరిగి వచ్చాను.

మళ్ళీ ఇవ్వాళ రాత్రి 8.30 గంటలు, గుంటూరు సిటీ ...

అత్యవసరమైన ఒక పని గురించి నా మిత్రుడు ఒక చిన్న మొత్తం నాకు పంపించాల్సివచ్చింది. నాకు ఎకౌంట్స్ ఉన్న రెండు బ్యాంకులు కూడా వాటి ఏటీఎమ్ సెంటర్స్‌లో అక్కడ డిపాజిట్ మెషీన్స్ కూడా పెట్టాయి.

వాటిని నేను అంతకుముందు చూశాను, వాడాను కూడా.

కానీ, మొత్తం ఒక 6 డిపాజిట్ మెషీన్స్ అస్సలు పనిచేయడం లేదు. లేదా, నిండిపోయాయి.

సమయం జస్ట్ రాత్రి ఎనిమిదిన్నర. ఈరోజు హాలిడే కూడా కాదు.

మరొక దారిలేదు. మరొక ముఖ్యమైన పని మళ్ళీ వాయిదాపడింది.

మన తప్పు ఏం లేకుండానే.

మన డబ్బు మనం అవసరానికి వాడుకోడానికి!

కట్ టూ మోదీ - 

డిమానెటైజేషన్, జీఎస్టీలతో ఆయన మంచే చేశాడో, ఇంకేం చేశాడో ఒక మామూలు పౌరుడిగా నాకంత పెద్ద అవగాహన ఇప్పటికీ రాలేదు.

నాకు అర్థమయ్యింది, నేను అనుభవించింది మాత్రమే నాకు తెలుసు.

గత ఏడాదిన్నర కాలంలో ఇలాంటి కష్టాలు ఎన్నో పడ్డాను నేను. ఇంకా పడుతూనే ఉన్నాను.

మోదీ ఒక్కడే కాడుగా? జాతీయస్థాయిలో ఆయన ఆర్థిక యంత్రాంగం అంతా ఇంకా ఏం చేస్తున్నట్టు? ఇలాంటి గ్రౌండ్ లెవల్ రియాలిటీస్ అన్నీ ఆయనకు అసలు తెలుసా? తెలిస్తే ఆయన ఏం చేస్తున్నట్టు? ఏం చర్యలు తీసుకున్నట్టు? ఇంకా ఎన్నడు ఈ పరిస్థితి మారుతుంది?

ఇది ఎవరి పుణ్యం?
ఎవరి గొప్పతనం?
ఎవరి చేతకానితనం?

పీవీ నరసింహారావు లాంటి వాడు కాని ఇలాంటి సమయంలో ఉంటే ఖచ్చితంగా పరిస్థితి ఇలా ఉండేదికాదు.

అసలిలాంటి సిగ్గుచేటైన పరిస్థితిని ముందు రానిచ్చేవాడేకాదు.

వి మిస్ యూ పీవీ గారూ ...

ఈరోజు మీ జయంతి సందర్భంగా మీకివే నా ఘన నివాళులు.  

No comments:

Post a Comment