Sunday 20 October 2013

యూటీవీ ప్రతిష్టాత్మక తొలి తెలుగు చిత్రం మహేష్ బాబుతో!

"మిర్చి" దర్శకుడు కొరటాల శివ పంట పండింది. తంతే గారెల బుట్టలో పడ్డాడు. మహేష్ బాబుతో సినిమా. అదీ దేశంలోనే అతి పెద్దదయిన కార్పొరేట్ ఫిలిం ప్రొడక్షన్ బ్యానర్‌లో!

"1 : నేనొక్కడినే", "ఆగడు" చిత్రాల్లో ప్రస్తుతం నటిస్తున్న మహేష్ బాబు తర్వాతి సినిమా కార్పొరేట్ స్టయిల్లో మరింత భారీగా ఉండబోతోంది.

దేశంలోనే అతి పెద్దదైన కార్పొరేట్ ఫిలిం ప్రొడక్షన్ బ్యానర్ "యూటీవీ", మహేష్ బాబు హీరోగా, ఆయన సోదరికి చెందిన ఇందిరా ప్రొడక్షన్స్‌తో కలిసి భారీగా తన తొలి తెలుగు సినిమాను నిర్మిస్తోంది. వచ్చే జూలై నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు న్యూస్.

డిస్నీ యూటీవీ సౌత్ బిజినెస్ చీఫ్ ధనుంజయన్‌తో పాటు, మహేష్ బాబు కూడా ఈ వార్తని ధృవీకరించారు.

ఇక దర్శకుడు కొరటాల శివ విషయానికొస్తే ఈ అవకాశం ఆయనను వరించిన అదృష్టం కాదు. ఆయన ఎదుర్కోబోతున్న పెద్ద చాలెంజ్!

కార్పొరేట్ బ్యానర్ కాబట్టి బడ్జెట్ విషయంలోనూ, నిర్మాణ విలువల విషయంలోనూ ఎలాంటి కొరత ఉండదు. రాజీ ఉండదు. ఎలాంటి పరిమితులు ఉండవు.

ఇప్పటికే మహేష్ చేస్తున్న "1", "ఆగడు" చిత్రాలకు భారీ అంచనాలున్నాయి. వాటిని మించినదేదో కొరటాల ఇవ్వగలగాలి. అదంత చిన్న విషయం కాదు. యూటీవీ, మహేష్ బాబు శివని సెలెక్టు చేసుకున్నారంటే ఆ సత్తా ఏదో వాళ్లు ఆయనలో గుర్తించినట్టే అనుకోవచ్చు. ఇక దాన్ని ప్రాక్టికల్‌గా సాధించటమొక్కటే ఆయన చేయాల్సింది.

లెట్స్ ఆల్ విష్ కొరటాల శివ బెస్టాఫ్ లక్!    

No comments:

Post a Comment