Friday 12 October 2018

31 జిల్లాలకు ఆ ముగ్గురు చాలు!

ఆ మధ్య, జి హెచ్ ఎం సి ఎన్నికలను కేటీఆర్‌కు అప్పగించారు. తనేంటో తడాఖా చూపించారు కేటీఆర్.

నారాయణ్ ఖేడ్ ఎన్నికను ట్రబుల్ షూటర్ హరీష్‌రావుకు అప్పగించారు. విజయ ఢంకా మోగించారు హరీష్‌రావు.

సింగరేణి యూనియన్ ఎన్నికలను కవితకు అప్పగించారు. వ్యూహాత్మకంగా అహోరాత్రులు కృషిచేసి అక్కడ అద్భుత విజయం సాధించి చూపెట్టారు కవిత.

కట్ చేస్తే - 

మొన్నటి మహాసభల నిర్వహణ విషయంలోనూ అంతే.

కొంగరకలాన్ కేటీఆర్‌కు, హుస్నాబాద్ హరీష్‌రావుకు, నిజామాబాద్ కవితకు అప్పగించారు. ఒక్కొక్కరు తమదైన శైలిలో కృషిచేసి, ఆయా సభలను ప్రతి కోణంలోనూ సక్సెస్ చేసి చూపించారు.

దటీజ్ కేసీఆర్!

ఏ పని ఎవరికి అప్పగించాలో, ఎలా విజయం సాధించాలో కేసీఆర్‌గారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు.

కట్ చేస్తే- 

ఇప్పుడు డిసెంబర్ 7న జరగబోతున్న ఎన్నికలు కేసీఆర్‌కు, టీఆరెస్‌కు, మొత్తం తెలంగాణకు అత్యంత ప్రతిష్టాకరమైనవి.

100 టార్గెట్.

రాష్ట్రంలో ఉన్న 31 జిల్లాలను ఈ ముగ్గురు వ్యూహాత్మక యోధులకు చెరొక 10 జిల్లాల చొప్పున అప్పగిస్తే చాలు. మిగిలే ఇంకో జిల్లాను కేటీఆర్‌కో, హరీష్‌రావుకో అదనంగా అప్పగిస్తే సరి. 

100 సీట్లు గ్యారంటీ.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ విషయం గురించి ఒక్క క్షణం ఆలోచిస్తే బాగుంటుందని నా హంబుల్ సజెషన్.  

No comments:

Post a Comment