పాట ఒకటి వచ్చిందీ
కన్నుల్లో నీరు తుడిచి
కమ్మటి కల ఇచ్చింది
రమ్యంగా కుటీరాన
రంగవల్లు లల్లిందీ
దీనురాలి గూటిలోన
దీపంగా వెలిగిందీ
శూన్యమైన వేణువులో
ఒక స్వరం కలిపి నిలిపిందీ
ఆకు రాలు అడవికి
ఒక ఆమని దయ చేసిందీ
విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడీ అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా
నది దోచుకు పోతున్న నావను ఆపండి
రేవు బావురుమంటోందని నావకు చెప్పండి
నావకు చెప్పండి ..."
కట్ టూ గుంటూరు శేషేంద్ర శర్మ -
కవిసేన మానిఫెస్టో రాసిన గుంటూరు శేషేంద్ర శర్మగారే బాపు గారి 'ముత్యాల ముగ్గు'లో ఇంత అద్భుతమైన పాట రాశారు.
ఈ పాటలోని ప్రతివాక్యం ఒక కొత్త ప్రయోగమే. ఒక కొత్త భావమే.
సుశీల తీయటి గొంతు, మహదేవన్ అద్భుత సంగీతంలో .. ఈ పాటలో వయొలిన్, వీణ, ఫ్లూట్ ఒకదాన్ని మించి ఒకటి 'ఓహ్' అనిపిస్తాయి.
ఎప్పుడూ పీకలదాకా ఉండే వ్యక్తిగత, వృత్తిగత వత్తిళ్ల రొటీన్ నగరజీవితం మధ్యలో కూడా, మొన్న రాత్రి నుంచి ఈ పాటను కనీసం ఒక అరడజను సార్లు విన్నాను.
నిన్న రాత్రి ఒక పార్టీ మధ్యలో మా మ్యూజిక్ డైరెక్టర్తో ఈ పాట గురించి ఒక అరగంట సేపు అలా ట్రాన్స్లోకెళ్లి చర్చించాను.
చాలా ఏళ్ల తర్వాత ఇంత మంచి పాట నేను గుర్తుకు తెచ్చుకోడానికి కారణమైన ఒక బ్లాగ్ కామెంటర్కు థాంక్స్ చెప్పకుండా ఎలా ఉండగలను?
"ఆశల అడుగులు వినపడీ అంతలో పోయాయి
ReplyDeleteకొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా
నది దోచుకు..."
అంతలో ఆగాయి అనీ నది తోసుకు పోతున్న అని గుర్తు. పాటను మరలా వినాలి నేను.