పార్టీలో అందరికీ ఆయన ఆప్తుడు. కల్మషంలేని నిర్మల హృదయుడు. గ్రౌండ్ టూ ఎర్త్ సింప్లిసిటీ.
టి ఆర్ ఎస్ ఆవిర్భావం నుంచి, కె సి ఆర్ వెంట ఆయనకు అతిదగ్గరగా ఉన్న అతి కొద్దిమంది ప్రధానవ్యక్తుల్లో ఆయన ఒకరు.
ఆయనే శేరి సుభాష్ రెడ్డి.
ముఖ్యమంత్రి కె సి ఆర్ పొలిటికల్ సెక్రెటరీ.
ఈ మధ్యే తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TSMDC) చైర్మన్గా కూడా నియమితులయ్యారు.
కట్ టూ సుభాషన్న -
కార్యకర్తలనుంచి అత్యున్నతస్థాయి పార్టీనాయకులదాకా, చాలామంది "సుభాషన్నా!" అని ప్రేమగా పలకరించే సుభాష్ రెడ్డి కూడా రాజకీయ నేపథ్యం నుంచే వచ్చారు. వారి తండ్రి అంతకుముందు సమితి ప్రసిడెంట్గా పనిచేశారు. మెదక్ జిల్లాకు చెందిన సుభాష్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా ఉపాధ్యక్షుడుగా కూడా పనిచేశారు.
పొలిటికల్ సెక్రెటరీగా తన దగ్గర అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్న ఆయన సేవలను గుర్తించి, ఇటీవలే ఆయనను TSMDC చైర్మన్ను కూడా చేశారు మన ముఖ్యమంత్రి కె సి ఆర్.
ఎన్నికల్లో టి ఆర్ ఎస్ ఘనవిజయం వెనుక వివిధ స్థాయిల్లో టి ఆర్ ఎస్ కార్యకర్తలు, అభిమానుల సోషల్ మీడియా పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. టి ఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా, కె సి ఆర్ బంగారు తెలంగాణ స్వప్నం సాకారం కోసం చేస్తున్న వేస్తున్న ప్రతి అడుగుకీ, చేస్తున్న ప్రతి పనికీ సంపూర్ణ మద్దతుగా, ఉద్యమం నాటి దూకుడే ఇప్పుడు కూడా మన TRS సోషల్ మీడియాలో రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతుండటం నిజంగా ఒక గొప్ప విషయం.
దీన్నంతటినీ ఎప్పటికప్పుడు ఒక కంట గమనిస్తూ, అవసరమైన చోట సలహాలనిస్తూ దిశానిర్దేశం చేసే మొదటి వ్యక్తీ, ఏకైక వ్యక్తీ సుభాష్ రెడ్డి.
ఇదంత చిన్నవిషయం కాదని నా ఉద్దేశ్యం.
మొన్న సెప్టెంబర్ 26 నుంచి 28 వరకు అమెరికాలో జరిగిన "ఇంటర్నేషనల్ మైనింగ్ ఎక్స్పో"లో TSMDC చైర్మన్ హోదాలో మన రాష్ట్రం తరపున పాల్గొనివచ్చారు సుభాష్ రెడ్డి.
అంతర్జాతీయంగా భూగర్భవనరుల వెలికితీతలో అనుసరిస్తున్న విధానాలు, వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ గురించి ఈ ఎక్స్పో ద్వారా బాగా అధ్యయనం చేసిన సుభాష్ రెడ్డి, మన తెలంగాణ మైనింగ్ రంగంలో కూడా ఆధునిక సాంకేతికతను జోడించి, చరిత్ర తిరగరాసే అత్యధిక ఆదాయం మన ప్రభుత్వానికి సమకూరేలా చేయాలన్న గట్టి సంకల్పంతో పనిచేస్తున్నారు.
కట్ టూ సుభాషన్న ఏకైక లక్ష్యం -
కె సి ఆర్ ఆమరణ దీక్ష చేస్తున్న సమయంలో - అనుక్షణం ఆయనను కంటికి రెప్పలా చూసుకున్న వ్యక్తిగా సుభాష్ రెడ్డికి పార్టీలో మంచి గుర్తింపు, గౌరవం ఉన్నాయి. సుమారు 14 సంవత్సరాల ఉద్యమంలో వ్యక్తిగత జీవితాన్ని దాదాపు త్యాగం చేసిన సుభాష్ రెడ్డి, సి ఎం కు పొలిటికల్ సెక్రెటరీగా ఉన్నా, TSMDC చైర్మన్ అయినా .. ఇప్పటికీ ఎప్పటికీ .. ఆయన లక్ష్యం ఒక్కటే:
"బంగారు తెలంగాణ సాధనలో ముఖ్యమంత్రి కె సి ఆర్ వెంటే నడవడం, కె సి ఆర్ ఆలోచనలను ప్రజలవద్దకు తీసుకెళ్లడం, ఉద్యమ సమయంలో ఎంతటి దీక్షతో అయితే కె సి ఆర్ వెంట పనిచేయడం జరిగిందో, అంతే దీక్షతో కె సి ఆర్ స్వప్నిస్తున్న బంగారు తెలంగాణ కోసం కూడా పనిచేయడం."
హాట్సాఫ్ సుభాషన్నా!
టి ఆర్ ఎస్ ఆవిర్భావం నుంచి, కె సి ఆర్ వెంట ఆయనకు అతిదగ్గరగా ఉన్న అతి కొద్దిమంది ప్రధానవ్యక్తుల్లో ఆయన ఒకరు.
ఆయనే శేరి సుభాష్ రెడ్డి.
ముఖ్యమంత్రి కె సి ఆర్ పొలిటికల్ సెక్రెటరీ.
ఈ మధ్యే తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TSMDC) చైర్మన్గా కూడా నియమితులయ్యారు.
కట్ టూ సుభాషన్న -
కార్యకర్తలనుంచి అత్యున్నతస్థాయి పార్టీనాయకులదాకా, చాలామంది "సుభాషన్నా!" అని ప్రేమగా పలకరించే సుభాష్ రెడ్డి కూడా రాజకీయ నేపథ్యం నుంచే వచ్చారు. వారి తండ్రి అంతకుముందు సమితి ప్రసిడెంట్గా పనిచేశారు. మెదక్ జిల్లాకు చెందిన సుభాష్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా ఉపాధ్యక్షుడుగా కూడా పనిచేశారు.
పొలిటికల్ సెక్రెటరీగా తన దగ్గర అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్న ఆయన సేవలను గుర్తించి, ఇటీవలే ఆయనను TSMDC చైర్మన్ను కూడా చేశారు మన ముఖ్యమంత్రి కె సి ఆర్.
ఎన్నికల్లో టి ఆర్ ఎస్ ఘనవిజయం వెనుక వివిధ స్థాయిల్లో టి ఆర్ ఎస్ కార్యకర్తలు, అభిమానుల సోషల్ మీడియా పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. టి ఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా, కె సి ఆర్ బంగారు తెలంగాణ స్వప్నం సాకారం కోసం చేస్తున్న వేస్తున్న ప్రతి అడుగుకీ, చేస్తున్న ప్రతి పనికీ సంపూర్ణ మద్దతుగా, ఉద్యమం నాటి దూకుడే ఇప్పుడు కూడా మన TRS సోషల్ మీడియాలో రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతుండటం నిజంగా ఒక గొప్ప విషయం.
దీన్నంతటినీ ఎప్పటికప్పుడు ఒక కంట గమనిస్తూ, అవసరమైన చోట సలహాలనిస్తూ దిశానిర్దేశం చేసే మొదటి వ్యక్తీ, ఏకైక వ్యక్తీ సుభాష్ రెడ్డి.
ఇదంత చిన్నవిషయం కాదని నా ఉద్దేశ్యం.
మొన్న సెప్టెంబర్ 26 నుంచి 28 వరకు అమెరికాలో జరిగిన "ఇంటర్నేషనల్ మైనింగ్ ఎక్స్పో"లో TSMDC చైర్మన్ హోదాలో మన రాష్ట్రం తరపున పాల్గొనివచ్చారు సుభాష్ రెడ్డి.
అంతర్జాతీయంగా భూగర్భవనరుల వెలికితీతలో అనుసరిస్తున్న విధానాలు, వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ గురించి ఈ ఎక్స్పో ద్వారా బాగా అధ్యయనం చేసిన సుభాష్ రెడ్డి, మన తెలంగాణ మైనింగ్ రంగంలో కూడా ఆధునిక సాంకేతికతను జోడించి, చరిత్ర తిరగరాసే అత్యధిక ఆదాయం మన ప్రభుత్వానికి సమకూరేలా చేయాలన్న గట్టి సంకల్పంతో పనిచేస్తున్నారు.
కట్ టూ సుభాషన్న ఏకైక లక్ష్యం -
కె సి ఆర్ ఆమరణ దీక్ష చేస్తున్న సమయంలో - అనుక్షణం ఆయనను కంటికి రెప్పలా చూసుకున్న వ్యక్తిగా సుభాష్ రెడ్డికి పార్టీలో మంచి గుర్తింపు, గౌరవం ఉన్నాయి. సుమారు 14 సంవత్సరాల ఉద్యమంలో వ్యక్తిగత జీవితాన్ని దాదాపు త్యాగం చేసిన సుభాష్ రెడ్డి, సి ఎం కు పొలిటికల్ సెక్రెటరీగా ఉన్నా, TSMDC చైర్మన్ అయినా .. ఇప్పటికీ ఎప్పటికీ .. ఆయన లక్ష్యం ఒక్కటే:
"బంగారు తెలంగాణ సాధనలో ముఖ్యమంత్రి కె సి ఆర్ వెంటే నడవడం, కె సి ఆర్ ఆలోచనలను ప్రజలవద్దకు తీసుకెళ్లడం, ఉద్యమ సమయంలో ఎంతటి దీక్షతో అయితే కె సి ఆర్ వెంట పనిచేయడం జరిగిందో, అంతే దీక్షతో కె సి ఆర్ స్వప్నిస్తున్న బంగారు తెలంగాణ కోసం కూడా పనిచేయడం."
హాట్సాఫ్ సుభాషన్నా!
No comments:
Post a Comment