Sunday 13 April 2014

మణిరత్నం "బ్లాక్‌బస్టర్ 2015"

డౌట్ లేదు. మణిరత్నం, నాగార్జున, మహేశ్ బాబు = బ్లాక్‌బస్టర్ 2015.

ఇది ఓవర్ కాన్‌ఫిడెన్స్ కాదు. అలా జరిగి తీరుతుందన్న నమ్మకం. అంతే.

నిజమే.. రోజా, ముంబాయి, నాయకుడు, దళపతి వంటి అద్భుత దృశ్యకావ్యాల్ని రూపొందించిన మణిరత్నంకు ఈ మధ్య కాలంలో హిట్‌లు లేవు. అలాగని దర్శకుడుగా మణి అప్పుడే 'స్టాగ్‌నేట్' అయ్యాడని చెప్పలేం.

సినిమానే జీవితంగా, తపస్సుగా తీసుకుని బ్రతికేవాళ్లు కొందరే. వాళ్లల్లో మణి కూడా ఒకరు.

బహుశా ఓ పాతికేళ్ల తర్వాత అనుకుంటాను. దర్శకుడుగా మణి తెలుగులో మళ్లీ చేస్తున్న స్ట్రెయిట్ చిత్రం ఇదే కావడం విశేషం. 1989 లో "గీతాంజలి" తర్వాత మళ్లీ  మణి చేస్తున్న ఈ స్ట్రెయిట్ తెలుగు చిత్రంలో కూడా నాగార్జున ఉన్నాడు. ఇది మరో విశేషం. ఈ రెండు విశేషాలకి తోడు, ఇదొక మల్టిస్టారర్ చిత్రం కావడం, మహేశ్ బాబు కూడా ఇందులో నటిస్తుండటం మరో పెద్ద ఎట్రాక్షన్.

ది బోర్న్ ఐడెంటిటీ, మిషన్ ఇంపాజిబుల్ రేంజ్‌లో మణిరత్నం డిజైన్ చేసి రూపొందిస్తున్న ఈ భారీ చిత్రానికి అస్కార్ విజేత రహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడని తెలిసింది. ఇంకేం కావాలి?

మణిరత్నం-నాగార్జున-మహేశ్ బాబు-రహమాన్..

ఈ నాలుగు దిగ్గజాల బ్రాండ్ నేమ్‌స్ చాలు. ఈ చిత్రం ప్రేక్షకుల్లో, మార్కెట్లో - ఏ రేంజ్‌లో క్రేజ్‌ని క్రియేట్ చేస్తుందో.. ఏ రేంజ్‌లో బిజినెస్ చేస్తుందో ఈజీగా గెస్ చేయొచ్చు.

ఆల్ ది బెస్ట్, మణి! 

No comments:

Post a Comment