Wednesday 17 October 2012

కోణార్కలో కదిలిన శిల్పం

గత మే నెలలో అనుకుంటాను .. ర్యాండమ్ హౌజ్, ఎం ఎస్ ఎన్ కల్సి ఒక రైటింగ్ కాంపిటీషన్ ను ప్రకటించాయి. దేశంలోనే 12 మంది అత్యుత్తమ స్థాయి కథానికా రచయిత్రుల కోసం పోటీ! పోటీలో పాల్గొనడానికి రచయిత్రులకు వారిచ్చిన థీమ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి:

1. "Woman in the City": 'Frankly my dear, I don't give a damn' -- Gone With the Wind

2. "Growing up in India": 'Experience is the name every one gives to their mistakes' -- Oscar Wilde

3. "The Man in my Life": 'Being with him made her feel as though her soul had escaped from the narrow confines of her island country into the vast, extravagant spaces of his' -- The God of Small Things

ఒక కండిషన్ ఏంటంటే - అయా థీమ్స్ తో పాటు ఇచ్చిన కొటేషన్స్ ని కూడా పోటీదారులు వారి కథానికల్లో ఎక్కడో ఒక చోట ఉపయోగించాల్సి ఉంటుంది. కండిషన్ వెరైటీ గా ఉంది కదూ? తర్వాత, పోటీకి సుమారు 400 వరకు ఎంట్రీలు వచ్చాయని రాశారు. వాటిల్లో అత్యుత్తమమైన 12 కథానికలను మాత్రం ఎన్నిక చేసి ఒక కథా సంకలనం రూపంలో ఇటీవలే విడుదల చేశారు.

అనుకోకుండా, రోజు సాయంత్రం జూబ్లీ హిల్స్ లో ఒక సినీ ఆర్టిస్ట్ ని కలవడానికి వెళ్లినపుడు అక్కడ పుస్తకం కనిపించింది. ఆశ్చర్యపోయాను. ముందుగా నటి కి ఉన్న ఉత్తమ స్థాయి పుస్తక పఠనం అభిరుచికి కంగ్రాట్స్ చెప్పాను. తర్వాత, అహ్మదాబాద్ నుంచి శంతన పాఠక్ రాసిన "మిరేజ్" కథ అప్పటికప్పుడే చదివాను. చాలా బావుంది.  

మామూలుగా చదవడానికే కొద్దిరోజుల సమయం తీసుకొనే నవల చదివినట్టుగా కాకుండా, కథానిక చదవటం అంత కష్టం కాదు. ఇక ఇలాంటి ఆధునిక తరం కథానికలు చదవటం అంటే నాలాంటి వారికి సులభం, ఇష్టం కూడా.  ఆ ఇష్టం తోనే ఒక కథని అప్పటికప్పుడే చదవగలిగాను బహుశా!

మీటింగ్ అయిపోయాక లేచివస్తోంటే - మిగిలిన 11 కథలు కూడా చదివి తర్వాత ఇవ్వండి అని "షి రైట్స్" పుస్తకాన్ని నాతో తీసుకెళ్లమంది ఆర్టిస్టు. ఇప్పుడునాకున్న పనుల్లో అవన్నీ చదవటం వెంటనే కుదరకపోవచ్చునని సున్నితంగా "ఇప్పుడు కాదు" అని చెప్పి వచ్చేశాను.  

ఇంటికి వస్తోంటే, దారిలో అనుకోకుండా రెండు మూడు విషయాలు గుర్తుకు తెచ్చుకోవటానికి ప్రయత్నించాను. నేనీ మధ్య అసలు కథానికలే ఏమీ చదవట్లేదు. సుమారు ఆరేళ్ల క్రితం అనుకుంటాను .. నేను చదివిన చివరి కథ - బుచ్చిబాబు రాసిన "నన్ను గురించి కథ రాయవూ". కథ ఇప్పటికి ఎన్ని సార్లు చదివానో నాకే తెలియదుఇక నేను రాసిన తొలి కథానిక "పెళ్లికి ముందు". బహుశా అది 1992 అనుకుంటాను. ఆంధ్ర భూమి వీక్లీలో అచ్చయింది. తర్వాత ఒక  రైటర్స్ మీట్ లో కల్సినపుడు అప్పటి ఆంధ్ర భూమి ఎడిటర్ సికరాజు గారు నన్ను బాగా మెచ్చుకోవటం నాకు ఇంకా గుర్తు. ఇక - నేను రాసిన చివరి కథానిక, నాకు గుర్తున్నంతవరకు, 2006 లో వార్త దినపత్రిక ఆదివారం బుక్ లో అచ్చయ్యింది కథ పేరు - "కోణార్కలో కదిలిన శిల్పం." 

ఉన్నట్టుండి చాలా యేళ్ల తర్వాత ఇప్పుడు మల్లీ ఒక కథ రాయాలనిపిస్తోంది. ఎప్పుడు రాస్తానో, అసలు రాస్తానో లేదో తెలియదు కానీ, కోరిక మళ్లీ నాలో పుట్టడానికి కారణమైన సాయంత్రానికీ, నటికీ థాంక్స్ చెప్పక తప్పదు

No comments:

Post a Comment